నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 10 ః ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలభద్రత కార్యక్రమంలో భాగంగా జిల్లా పీ.డి వెంకటరత్నం, ఏపీడి చందన, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది మండలంలో పలు పంచాయతీలలో సాగునీటి వనరులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాములను పరిశీలించారు. చెరువులు కాలువలు, మరమ్మతులు, కట్టలు, మొరవలు బలోపేతం, జంగిల్ క్లీనింగ్, గుర్రపు డెక్క తొలగింపు తోబాటు నీటి సంరక్షణ పనులు గుర్తించి పరిష్కారానికి నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏపీఓ అంజనప్ప విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఈసీ మహేష్, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత, భూదేవి ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు, కూలీలు పాల్గొన్నారు
Reporter
Namitha News