నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 14 : పేద విద్యార్థులకు అండగా ఉంటున్న ప్రముఖ విజయభారతి విద్యా సంస్థ అధినేత డాక్టర్ సేతు అండగా నిలుస్తున్నారు. విద్యా ప్రదాతగా ఆయన సేవలు అమోఘం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని లైఫ్ కేర్ రాజా శేఖర్ సూచించారు. సోమవారం ఆయన జన్మదిన సందర్భంగా మదనపల్లి పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించారు. ఆప్యాయంగా డాక్టర్ సేతును హత్తుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మృదు స్వభావి,స్నేహశీలి, నిగర్వి నిరాడంబరం కలిగిన వ్యక్తిత్వం ఆయనకు సొంతమన్నారు. ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఎంతో మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇటువంటి విద్యా ప్రదాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయ నాయకులకు అతీతంగా సేవలను కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఆత్మీయుడుగా పేరు పొందారన్నారు. భవిష్యత్తులో ఆయనకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Admin
Namitha News