నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 15 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ భవిష్యత్తులో మరో శ్రీశైలం కావడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తంబళ్లపల్లె సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు లు కొనియాడారు. వారిని ఈవో మునిరాజా, రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు నాయుడు,రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, టిడిపి నాయకులు మల్లయ్య కొండకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు , సీడ్ మల్లికార్జున నాయుడు లు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు పొందారు. మల్లయ్య కొండ మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో పాటు టిడిపి నాయకులను అభినందించి కూటమి పాలనలో మల్లయ్య కొండ మరింత అభివృద్ధి చేయడానికి సహకరిస్తామన్నారు.
Reporter
Namitha News