నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 07 : మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు రామ తులసి కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం శ్రీ రాజశ్రీ ట్రాక్టర్స్( న్యూ హాలాండ్ ) షోరూమ్ ను ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా ప్రారంభించారు. రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల పెద్దిరెడ్డి యాజమాన్యం తో ఈ షోరూంను ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా అధునాతనమైన టెక్నాలజీతో ఏర్పాటుచేసిన న్యూ హాలాండ్ ట్రాక్టర్ ను నడిపి, ఈ ట్రాక్టర్ యొక్క ఉపయోగాలను తెలియజేశారు. రైతుల వ్యవసాయానికి సంబంధించి న్యూ హాలండ్ ట్రాక్టర్ అనేక రకాలుగా ఉపయోగపడి, వారికి అవసరమయ్యే అన్ని అవసరాలను వేగవంతంగా చేస్తూ, కొత్త టెక్నాలజీతో తయారైన ఈ ట్రాక్టర్ ను రైతులు కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ పార్టీ నేత పెద్దిరెడ్డి ఈ షోరూం ను రైతుల కోసమే ప్రారంభించినట్లు తెలిపారు. మదనపల్లితో పాటు వి.కోట, రాజంపేట పట్టణంలో కూడా ఈ షోరూం ను ప్రారంభించడం సంతోషమన్నారు. డబుల్ క్లిక్ సదుపాయాలు, అధిక పిటిఓ, హెచ్.పి, తక్కువ గేర్ ఆయిల్ సామర్థ్యం, ఎక్కువ పనితీరు, 125 సంవత్సరాల అనుభవం, అత్యధిక మన్నిక కలిగిన హాలాండ్ ట్రాక్టర్ ను రైతులు కొనుగోలు చేసి లాభాలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ట్రాక్టర్ షోరూమ్ యజమాని పెద్దిరెడ్డి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో న్యూ హాలాండ్ ట్రాక్టర్ షోరూం ప్రారంభించడం సంతోషమన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత నాణ్యతతో నెంబర్ వన్ ట్రాక్టర్ కంపెనీ న్యూ హాలాండ్ అన్నారు. రాజంపేట పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో తయారైన న్యూ హాలాండ్ ట్రాక్టర్ వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News