Sunday, 13 September 2026 11:02:44 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కనీస అభ్యసన సామర్థ్యాల మెరుగుదల లక్ష్యం

ఎఫ్‌ఎల్‌ఎన్‌ బేస్‌లైన్‌ సర్వే ప్రారంభం - డిఈఓ సుబ్రహ్మణ్యం

Date : 24 November 2025 06:31 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 24 : విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలను పెంపొందించేందుకు ఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) బేస్‌లైన్‌ సర్వేను ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన 3,689 ప్రాథమిక పాఠశాలల్లో 1,11,587 మంది విద్యార్థులపై ఈ సర్వేను లీప్ యాప్‌ ద్వారా సోమవారం ప్రారంభించారని చెప్పారు. సర్వేలో డైట్ విద్యార్థులు, సీ ఆర్ పీలు, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు పాల్గొంటున్నారని వివరించారు. విద్యార్థుల బలహీనతలు, వెనుకబడిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ వంటి అంశాలను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం స్పష్టంగా గుర్తించగలదని చెప్పారు. దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రిమిడియల్ బోధన, ప్రత్యేక శిక్షణలు, విద్యా నాణ్యత మెరుగుదల కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. తదనంతరం డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి రాయచోటి మండలం అబ్బవరం హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సర్వే నిర్వహణను పరిశీలించి సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అంతిమ లక్ష్యం 1–5 తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకాలను సులువుగా చదవడం, గణితంలోని ప్రాథమిక లెక్కలు చేయగలగడం, తద్వారా ఉన్నత తరగతుల్లో అభ్యాసంలో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాత్రోపాధ్యాయిని సాగరిక, సిఆర్‌పి విజయలక్ష్మి, ఉపాధ్యాయిని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :