నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 27 : విద్యుత్ శాఖ సిబ్బంది (ఎస్.పి.డి.సి.ఎల్) అంకితభావంతో రైతులు, వినియోగదారుల సేవలే మనకు నిజమైన ప్రశంసలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని డి.ఈ గంగాధరం సూచించారు. ఈ సందర్భంగా కన్నెమడుగు సబ్ స్టేషన్ లో తంబళ్లపల్లె మండల 11 కెవి విద్యుత్ రూరల్ ఫీడర్ ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇదేవిధంగా గణతంత్ర వేడుకల్లో ప్రశంసాపత్రాలు పొందిన ఏఎల్ఎం అమీన్, జేఎల్ఎం శ్రీకాంత్ లను అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందజేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లింపులో చొరవ చూపాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.డి గోవిందరెడ్డి,ట్రాన్స్ఫార్మర్ డిఈ విజయ భాస్కర్, ఏ.డి ఆదినారాయణ, టిఆర్ఎ-2 రమణారెడ్డి, ఏఈలు సురేంద్ర, సుబ్బయ్య, శేషు, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర, నాగేంద్ర, ఆయాజ్, నవాజ్, ఇంతియాజ్, నాగేంద్రబాబు, శేషు, కాలేశా, రమేష్, సురేష్, ప్రవీణ్, రాజశేఖర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News