నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పోలియో రహిత సమాజం కోసం వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని కోసువారిపల్లె పీహెచ్సీ డాక్టర్ షణ్ముగం సూచించారు. బుధవారం తంబళ్లపల్లె సబ్ సెంటర్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్ష లో మాట్లాడుతూ మండలంలో జూన్ 28న జరిగే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసి పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి కృషి చేయాలన్నారు. వైద్య సిబ్బంది మండలంలోని విద్యుత్ సబ్ సెంటర్ల పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పారిశుద్ధ్యం తో పాటు తాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న వర్షాకాలంలో ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాలలో గర్భిణీలు ఆసుపత్రులలో డెలివరీలకు ప్రోత్సహించి సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ వంతు సహకారం అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర, ఎమ్ ఎల్ హెచ్పీ అమరావతి, మేల్ వర్కర్ కృష్ణనాయక్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .
Reporter
Namitha News