నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 03 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండ శివాలయం హుండీ ఆదాయం రూ 13,10,890 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండ కిట్ట లు తెలిపారు. బుధవారం ఉదయం టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, పురుషోత్తం, వీరాంజనేయులు, సుధాకర్ రెడ్డి, వెంకటరమణ, వెంకట్ రెడ్డి మరియు భక్తుల సమక్షంలో ఆలయ ప్రధాన హుండీ లెక్కించగా రూ 13,10,890 లక్షల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామిలు నిర్వహించారు.
Reporter
Namitha News