Thursday, 30 July 2026 12:15:37 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె టిడిపి అధ్యక్ష పీఠం పై పీఠముడి - టీడీపీ ఐ వి ఆర్ సర్వేలో ముగ్గురు పోటీ

ఇద్దరు బిసి, ఓసి పోటా పోటీ

Date : 21 December 2025 06:40 PM Views : 273

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 21 : తంబళ్లపల్లె మండల అధ్యక్ష పీఠం పై అధిష్టానం జాప్యం చేయడంతో పీట ముడి పడింది. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం తో పాటు ఎమ్మెల్యే స్థానికంగా ఉండి వైకాపా బలంగా ఉండే మండలంలో టిడిపి అధ్యక్ష పీఠం ఆర్థిక, అంగ, బలమైన వర్గం కలిగిన నాయకుడి ని ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ మండల అధ్యక్ష పీఠానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఐవిఆర్ సర్వే సైతం నిర్వహించింది. మండల అధ్యక్ష, గ్రామ కమిటీ అధ్యక్ష ఎన్నికలు మాజీ టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సారధ్యంలో జరిగాయి. అనంతరం మరోమారు అబ్జర్వర్లు కొన్ని గ్రామ కమిటీలను మార్చడం పై పార్టీలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ మధ్య మల్లయ్య కొండ కింద అధ్యక్ష ఎన్నిక కోసం 12 మంది పోటీ పడడం గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసినట్లయింది. గత ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని కష్టపడిన కార్యకర్తలు ఎవరికి వత్తాసు పలకాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఓవైపు వైకాపా రోజురోజుకు తంబళ్లపల్లె లో బలం పుంజుకున్నట్లు తమ కార్యక్రమాలతో బల ప్రదర్శన చేస్తున్నారు. తంబళ్లపల్లెలో వైకాపాను ఎదుర్కోవాలంటే ఎలాంటి విమర్శలు లేకుండా ఆర్థిక, అంగ, వర్గం కలిగి నిస్వార్ధంగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జిగా ఎవరిని నియమించినా పార్టీకి కష్టపడే నాయకుడిని నియమిస్తే తంబళ్లపల్లెలో టిడిపి కి పూర్వ వైభవం ఖాయం. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టిడిపి అధిష్టానం భేషజాలకు వెళ్లకుండా ఏ నాయకుడిని మండల అధ్యక్షునిగా ఎంపిక చేసినా కష్టకాలంలో పని చేసి నష్టపోయి విసిగి పోయిన మెజారిటీ కార్యకర్తలు ఏకాభిప్రాయం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధిష్టానం మీ నమేషాలు లెక్కించకుండా వర్గ పోరు లేకుండా అందరిని కలుపుకొని పోరాట పటిమ కలిగిన నాయకుడిని ఎంపిక చేసి తంబళ్లపల్లె అధ్యక్ష పదవి ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల రణ రంగానికి సిద్ధం కావాల్సి ఉంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :