Monday, 14 September 2026 05:26:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు

- ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణి

Date : 13 September 2026 06:51 PM Views : 12

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు - ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణి మదనపల్లె : మదనపల్లెలో మత సామరస్యానికి,పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఖాన్ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తోంది.వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని,ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అనవాయితీగా నిర్వహిస్తున్న పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలు,మొక్కల పంపిణి ఈ ఏడాది కూడా నిర్వహించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.ఏపీ ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,ఆర్టీసీ ఈయు 1,2 డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి,టిడిపి సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్,రాటకొండ మధుబాబు, బాబు నాయుడు,అయూబ్ ఖాన్,బావాజాన్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజలకు ప్రకృతిని కాపాడుకుందాం,పర్యావరణాన్ని పరిరక్షిస్తూ,భక్తి,బాధ్యత రెండింటినీ చాటి చెబుతూ ఉచితంగా వినాయక విగ్రహ ప్రతిమలను పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా భక్తిభావంతో పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రతి ఏటా ఆనవాయితీగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహ ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.నేడు పర్యావరణం సమతుల్యత దెబ్బతిని ప్రకృతి క్షీణిస్తున్న నేపథ్యంలో తిరిగి మొక్కలను పెంపొందించాలన్న సదుద్దేశంతో విత్తనాలతో కూడిన గణపతిని మరియు మొక్కలను ఇవ్వడం మూలంగా కొత్త మొక్కలు నాటడం నిమజ్జనం చేసిన గణపతి ప్రతిమల నుంచి కొత్తమొక్కలు మొలచి ప్రకృతిని కాపాడడానికి దోహదపడేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు.భవిష్యత్తు లో ఖాదర్ ఖాన్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను పెద్దఎత్తున అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,అభిమానులు,కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :