నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 12 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు స్థలానికి అనుమతి ఇవ్వాలని తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీటీవో బాపూజీ పట్నాయక్ లకు మండలం లోని వడ్డెర సంఘం నాయకులు కోరారు.సోమవారం వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కాస్ రోడ్ లో బసవన్న రాతి వద్ద లేక మొలకల చెరువు సర్కిల్ వద్ద వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అదేవిధంగా క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని వారపు సంత ప్రభుత్వ స్థలంలో నిర్వహించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి వెంకటరమణ, రామ లక్ష్మమ్మ, పద్మావతి, ఉప్పుతోళ్ల శివరాం, శివ కేశవ, డేరంగుల మనోహర్, ఒలిపి రవికుమార్, ఇడగొట్టు రమేష్ బాబు, రెడ్డప్ప, తేపల్లి మల్లికార్జున, శంకర, గోపాలకృష్ణ, వెంకటరమణ వెంకటరమణ, శ్రీనివాసులు, వీరభద్ర, రవీంద్ర, దాసప్ప,మండలంలోని వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News