Tuesday, 15 September 2026 08:51:52 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మిట్స్ లో ఘనంగా ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం–2026

Date : 05 May 2026 09:47 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 05 : మదనపల్లి సమీపం అంగళ్ళు లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్, ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె. పద్మనాభం, సీఈఓ, పవన్ ఎంపవర్ సొల్యూషన్స్, పలమనేరు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడల రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండింగ్, మరియు పేటెంట్ల పాత్ర ఎంతో కీలకమని, యువత ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ సంస్థ చేపడుతున్న చౌకైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి పరిష్కారాలు మరియు సామాజిక ఉపయోగాల కోసం రూపొందించిన సాంకేతిక పరికరాల గురించి వివరిస్తూ, గ్రామీణ స్థాయి ఆలోచనలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేయడానికి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లు మరియు పరిశ్రమ–విద్యాసంస్థల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థాపకత, మేధస్సు హక్కుల సంరక్షణ మరియు సమాజ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలపై విద్యార్థులకు అవగాహన కలిపించారు. నవ భారత్ నిర్మాణంలో మేధో సంపత్తి హక్కుల పరిరక్షణే పునాది అని, ప్రతి ఒక్కరూ తమ వినూత్న ఆలోచనలకు రక్షణ కల్పించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డాక్టర్ పి.శివయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :