నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : ఏపీ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఏడిఈ గోవింద్ రెడ్డి సారధ్యంలో ఏఈ సూచనలతో విద్యుత్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ సమస్యల పరిష్కారానికి జన బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం మండలంలోని కన్నెమడుగు, మరి మాకులపల్లి పంచాయతీలలో విద్యుత్ ఉద్యోగులు రైతుల పొలాల వద్ద 11 కెవి, ఎల్ టి విద్యుత్ వైర్లు పరిశీలిస్తూ క్రిందికి వేలాడే వైర్లు సరిచేస్తూ, వాలిన విద్యుత్ స్తంభాలు గుర్తించి సరి చేయడం. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు ఎత్తు పెంపు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు , పాఠశాలల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె ఎత్తు పెంచడం లేదా ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ డి ఈ ప్రజలతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు పంపిణీ తో పాటు సమస్యల పరిష్కారానికి ఈ జన బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 12:30 గంటలు సీఎం డి, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు ఎస్ఈ డయల్ యువర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ లు శంకర, రమణ, జనార్ధన్, ఏ ఎల్ ఎం నాగేంద్ర, జేఎల్ఎం లు ఇంతియాజ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News