నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రాధాన్యత నివ్వాలని మల్లయ్య కొండ ఆలయ పునర్నిర్మాణ కర్త ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన తొలుత మార్గమధ్యంలోని వెలుగు మల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ఆమెకు తొలి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లయ్య కొండ మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు, రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల అన్నదానం నిర్వహణ పై ఆరా తీసి సంతృప్తి పనిచేశారు. మల్లయ్య కొండపై భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్వామి పుష్కరిణి, గౌరీ మాత ఆలయం, ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ లు పరిశీలించి సౌకర్యాలు పై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం ఆర్టీసీ సర్వీసులు నిర్వహణ భక్తుల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News