Sunday, 03 May 2026 09:17:14 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

మల్లయ్య కొండ లో భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

Date : 22 April 2026 08:56 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రాధాన్యత నివ్వాలని మల్లయ్య కొండ ఆలయ పునర్నిర్మాణ కర్త ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన తొలుత మార్గమధ్యంలోని వెలుగు మల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ఆమెకు తొలి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లయ్య కొండ మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రజలు, రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల అన్నదానం నిర్వహణ పై ఆరా తీసి సంతృప్తి పనిచేశారు. మల్లయ్య కొండపై భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, స్వామి పుష్కరిణి, గౌరీ మాత ఆలయం, ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ లు పరిశీలించి సౌకర్యాలు పై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం ఆర్టీసీ సర్వీసులు నిర్వహణ భక్తుల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :