నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రిల్ 02 : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని చెంబకూరు జడ్పి హై స్కూల్ నందు గురువారం స్కౌట్స్ మరియు గైడ్స్ కార్యక్రమాలు పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నాగరత్న అధ్యక్షతన నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెంబకూరు వైద్య అధికారి పి.జాహ్నవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, సేవాభావం వంటి అంశాలను జీవితంలో అనుసరించాల్సిన అవసరాన్ని వివరించారు. స్కౌట్ మాస్టర్ కె.బి. అన్వర్ సాదత్ మాట్లాడుతూ స్కౌట్స్ మరియు గైడ్స్ కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Admin
Namitha News