Monday, 14 September 2026 07:31:56 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మహిళ ఆరోగ్యమే ఆ కుటుంబానికి శ్రీరామరక్ష - డి.ఆర్.డి.ఏ. పి.డి నాగేశ్వరావు

Date : 20 February 2026 10:50 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబానికి ఆమె శ్రీరామరక్షగా నిలుస్తుందని డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు హితబోధ చేశారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో రైతు సాధికారిక సంస్థ ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, అమలు సామర్ధ్య పెంపుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణతో పాటు ప్రకృతి వ్యవసాయం, జీవన ఎరువులు, కషాయాలతో పండిన పంటలు ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. మహిళా సంఘాలు ఫుడ్ బాస్కెట్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో పెరటి తోటలు పెంపకం అలవర్చుకోవాలన్నారు. నేటి మానవ సమాజానికి ప్రకృతి వ్యవసాయ పంటలే ఆరోగ్యకరమని ప్రతి ఒక్కరు దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఫుడ్ బాస్కెట్, కార్యాచరణ, అమలు, సామర్ధ్య పెంపుపై రైతు సాధికారిక సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సునీత, మండల కోఆర్డినేటర్ రుక్మిణి లు మహిళా సంఘ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘమిత్రలు, వివో సభ్యులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :