నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఆగస్ట్ 29 : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో పందాల.పద్మ అనే మహిళ తమ గ్రామానికి చెందిన కొందరు తమ మధ్య ఉన్న పాత గొడవల నేపథ్యంలో తనను తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. గ్రామంలోని 30 ఏళ్ల క్రితం పెద్దలనాటి తమ సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకున్నామని తమ ఇంటి ముందు నాపరాళ్ళు పరుచుకొని తమ హద్దులు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.. కానీ గత కొద్ది రోజులుగా తమ ఇళ్లకు కింద వైపు ఉండే కొందరు గతంలో తమ మధ్య ఉన్న గొడవలను మనుసులో ఉంచుకొని తమ సొంత స్థలంలో దారి కావాలంటూ వేధిస్తూ తమను తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అధికారులను తీసుకువచ్చి తమను బెదిరిస్తూ జెసిబి ఇతర వాహనాలను ఇంటి పైకి తీసుకువచ్చి ఇంటిని ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారని అధికారులు కూడా వారికే మద్దతిస్తున్నారని తెలిపారు..ఇది తమ సొంత స్థలం అని గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారని అటువంటిది ఎవరికి సంబంధం లేని తమ సొంత ఇంటి స్థలంలో బాట ఇవ్వమంటూ వేదనకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు తగు న్యాయం చేయాలని బాధితురాలు పద్మ వాపోయింది
Reporter
Namitha News