నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 31 : తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి (బాలిరెడ్డిగారిపల్లి) పంచాయతీ లోని 22 గ్రామాలకు సెల్ టవర్ లేక ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. శనివారం పెన్షన్లు పంపిణీ కోసం అధికారులు వృద్ధులను విధి లేని పరిస్థితుల్లో గుట్టలు ఎక్కించి నెట్వర్క్ ఉన్న చోటికి రమ్మని చెప్పడంతో విధి లేని పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ కోసం ముప్పు తిప్పలు పడి గ్రామానికి సుదూర ప్రాంతంలోని గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సెల్ టవర్ నిర్మాణం చేపట్టాలని గత ఆరు మాసాలుగా స్థానిక టిడిపి రాజంపేట పార్లమెంటు రైతు నాయకుడు వెంకట్ రెడ్డి బృందం ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్, నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి లకు ఫిర్యాదులు చేశారు. సెల్ టవర్ లేకపోవడంతో పెన్షన్ దగ్గర నుండి ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సెల్ టవర్ నిర్మాణానికి సహకరించాలని టిడిపి రాజంపేట రైతు నాయకుడు వెంకట్రెడ్డి, స్టోర్ డీలర్ సుధాకర్, ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News