Wednesday, 29 July 2026 11:12:08 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులచే వారం రోజులు పాటు హెల్త్ క్యాంపు

దంత, కంటి పరీక్షల శిభిరం

Date : 23 February 2026 05:18 PM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యన్.ఎస్.ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో బి.కొత్తకోట సమీపంలోని గట్టు గ్రామంలో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక క్యాంప్ లో భాగంగా దంత, కంటి ప్రత్యేక వైద్య శిబిరం మరియు పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ మొదటి రోజులో భాగంగా మదనపల్లి లోని స్కంద డెంటల్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దంత వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్కంద డెంటల్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ డాక్టర్ రెడ్డి అఖిల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి దంత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా అవసరం అని, చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోవాలి అని అన్నారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోమడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం మంచి అలవాటు అని అన్నారు. పళ్ల సమస్యలు మొదటి దశలో నొప్పి లేకుండా ఉండవచ్చు కానీ సమయానికి పరీక్ష చేయించుకోకపోతే దంత క్షయం, మసూళ్ల వాపు, రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా దంత పరీక్ష చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సులభంగా చికిత్స చేయవచ్చు అని అన్నారు. ఇలాంటి దంత వైద్య శిబిరాలు ఆరోగ్యవంతమైన గ్రామ సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. గట్టు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో యన్.ఎస్.ఎస్ ఆఫీసర్ పి.రాజేష్, 50 మంది యెన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :