Saturday, 12 September 2026 04:30:56 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఎల్ నినో తో ఎండిన పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Date : 07 August 2026 07:35 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 07 ః ఎల్ నినో ప్రభావం తో వర్షాలు లేక ఎండిన పంటలను శుక్రవారం వ్యవసాయ అధికారి రమణ కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుంచి కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి అగ్రి పాలిటెక్నిక్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఎద్దులవారిపల్లి, ఒక్కవారిపల్లి, జెన్నెవారిపల్లి, మూలపల్లి మరియు తంబళ్లపల్లె వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. వర్షాధారపు వేరుశనగ, కంది పంటలు పూర్తిగా దెబ్బతిని భూములు బీడు భూములు గా మారినట్లు గుర్తించారు. బోర్ల కింద సాగునీరు ఇంకిపోయి వరి పంట దాదాపు కనుమరుగైనట్లు అదే విధంగా మల్బరీ సాగు గుర్తింపు లేకుండా పోయినట్లు అంచనా వేశారు. వర్షాధారపు మామిడి తోటలు సైతం నీరు లేక ఎండుతున్నట్లు దీంతోపాటు అడవి పందుల బెడద తో ఎన్నడు లేని విధంగా పూర్తిగా పంటలు నాశనమైనట్లు రైతులు శాస్త్రవేత్తలకు వివరించారు. ఖరీఫ్ సీజన్ కు గాను ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో కందులు, ఉలవలు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపిణీ చేసి అటవీ శివార్లపొలాలకు అడవి పందుల బెడద తప్పించడానికి ప్రభుత్వం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సహకరించాలని రైతులు కోరారు. ఈ పర్యటనలో తిరుపతి శాస్త్రవేత్త డాక్టర్ కదిరి మోహన్, కలికిరి టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ హర్షవర్ధని, కలికిరి పాలిటెక్నిక్ అగ్రి విద్యార్థులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఎద్దులవారిపల్లి వి ఏ ఏలు సురేష్, రెడ్డి శేఖర్, సుధాకర్, రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :