నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : రాజంపేట - మే 23 : రాజంపేటలో జరిగిన “ఉద్యోగ భద్రత ప్రతి ఇంటికి” కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేంతవరకు వారి వెంటే ఉంటామని తెలిపారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 405 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. పరిశ్రమల అభివృద్ధితోనే ఉద్యోగ భద్రత సాధ్యమని, స్థానికంగా చిన్న, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీ సిటీ, TCL వంటి సంస్థలతో కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో మహిళల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు
Reporter
Namitha News