Tuesday, 15 September 2026 12:22:06 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి

రెన్యూవల్ చేసుకోవాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ హుస్సేన్

Date : 27 July 2026 01:30 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నందు 2009 సంవత్సరం నుండి గుర్తింపు కార్డులు పొందిన భవననిర్మాణ కార్మికులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాలని మదనపల్లె అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ హుస్సేన్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం బి.కొత్తకోట పీటియం రోడ్ నందు గల రాజా ఫంక్షన్ హాల్ నందు భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించి కొంతమంది కార్డులు రెన్యూవల్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ;ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు సహజ మరణానికి 60,000/, దహన క్రియలకు 20 వేల రూపాయలు,ఇద్దరు ఆడబిడ్డల వివాహాలకు ఒక్కొక్కరికి 20,000 రులు, అలాగే ఒక్కొక్క ఆడబిడ్డకు రెండేసి కాన్పులు చొప్పున ప్రసూతి సహాయం క్రిందన 20వేల రూపాయలు, అలాగే కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి శిక్షణ కాలంలో రోజుకు 300 రూపాయల ఆర్థిక సహాయం కల్పించాలని గత మార్చి నెల ఒకటో తారీఖు నుండి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకున్నదని ఆయన వివరించారు.కాబట్టి సంక్షేమ బోర్డు నందు తమ పేర్లను నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందిన కార్మికులందరూ తమ కార్డులను రెన్యువల్స్ చేసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని,అలాగే కార్డులు పొందని కార్మికులు సభ్యులుగా నమోదు చేయించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సిబ్బంది శంకర్, బి. కొత్తకోట హార్డ్ వేర్ యూనియన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్మిక నాయకులు ఎస్. మనోహర్ రెడ్డి,జి.రఘునాథ్,ఎం.అష్రఫ్అల్లి,యస్.తంబయ్యశెట్టి,డి.పెన్నయ్య,ఎస్.జవహార్ బాబు,బి.వెంకటరెడ్డి,బి. చెన్నకేశవులు,అంజి, రమేష్,నాగరాజు,రెడ్డి మరియు భవనిర్మాణ కార్మికులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: