నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 25 : అన్నమయ్య జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి గా డాక్టర్ శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డి.యం.హెచ్.ఓ. గా పనిచేసిన డాక్టర్ లక్ష్మీనరసయ్య సస్పెండ్ కావడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు కడప జీజీహెచ్ ఆర్ఎంవోగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ ఛార్జ్ డి.యం.హెచ్.ఓ. గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు
Reporter
Namitha News