Monday, 14 September 2026 08:27:46 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థులకు టోస్ట్‌మాస్టర్స్ ద్వారా కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి” పై అవగాహన

Date : 13 May 2026 04:55 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 13 : అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగ్వేజస్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం “టోస్ట్‌మాస్టర్స్ ద్వారా కమ్యూనికేషన్ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి” అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టోస్ట్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ, ఆంధ్ర మరియు తెలంగాణ డివిజన్ డైరెక్టర్ విక్రమ్ చంద్ర పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణంలో వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, టోస్ట్‌మాస్టర్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజల ముందుకు ధైర్యంగా మాట్లాడే నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్లబ్ సమావేశాలు విద్యార్థులకు సురక్షితమైన మరియు ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పిస్తూ వారి ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయని అన్నారు. టోస్ట్‌మాస్టర్స్ విద్యా కార్యక్రమం సంభాషణ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించబడిన అభ్యాస ప్రయాణమని, వివిధ పాత్‌వేస్ ద్వారా విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని వివరించారు. అలాగే స్పీచ్‌క్రాఫ్ట్ వంటి ప్రసంగ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు మాట్లాడే భయం తొలగి, ఆత్మవిశ్వాసం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలు మరియు ప్రముఖ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, లీడర్‌షిప్ మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, టోస్ట్‌మాస్టర్స్ శిక్షణ ద్వారా విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాంపస్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్లు మరియు కార్పొరేట్ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనే సామర్థ్యం పెరిగి, విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ సుధాకర్ బీదం, అసిస్టెంట్ డైరెక్టర్–ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్. బాలాజీ, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీగణేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :