నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : జై భారత్ నేషనల్ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ పీట్ల అంజలి విశ్వనాథ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. పీట్ల అంజలి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గణనీయమైన అణగారిన వర్గాల ఓట్లు సాధించి తదుపరి అణగారిన వర్గాల ప్రజల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చింది. అంజలి చేస్తున్న ప్రజా పోరాటానికి జై భారత్ పార్టీ నుండి సహకారం లేకపోవడంతో పార్టీ విడాలని నిర్ణయించుకుంది. ఆమె చేసిన ప్రజా పోరాటాలను గమనించిన బిజెపి నాయకులు పీట్ల అంజలిని పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం రాజంపేట బిజెపి కార్యాలయంలో జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్ అంజలికి బిజెపి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం తో పాటు దేశంలో బిజెపి సారధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని వారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి బిజెపి లోకి చేరినట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీ మదనపల్లిలో జరిగే వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తంబళ్లపల్లె నుండి భారీ ఎత్తున కార్యకర్తలను తరలించి అధినాయకుల ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. ఆమె వెంట తమ్ముళ్ళపల్లె నియోజకవర్గం లోని నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News