నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 09 : వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన రామగోపాలచారి–మానస దంపతుల కుమారుడు, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని పొనుగోటి నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో మృతి చెందడం తీవ్ర విషాదకరం ఇటీవలే నిరంజన్ను స్వయంగా కలిసి పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఈ విషాద వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోతుల సాయినాథ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి నిరంజన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూజారి సురేంద్ర, పవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారుజోల్లా సుదర్శన్, జగడం అనిల్, అడపాల మురళి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News