నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : కోసువారిపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ షణ్ముఖ ఆదేశాల మేరకు శుక్రవారం తంబళ్లపల్లె మండల కేంద్రంలో వైద్య సిబ్బంది మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా దోమ నివారణ చర్యలు,ప్రజలకు మలేరియా పై ముందస్తు జాగ్రత్తలు, పారిశుద్ధ్యం మెరుగు, తాగునీరు కాలుష్య నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, తదితర అంశాలపై నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండలంలోని ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, మేల్ వర్కర్ కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News