నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో పార్టీకి అండగా నిలవాలని టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని ఎగువ బోయపల్లెలో కొడిగి మల్లికార్జున, కృష్ణమాచారి లా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కట్టాదొరస్వామి నాయుడుకు పూలమాలలు, దృశ్యాలవులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తంబళ్లపల్లె టిడిపికి అధిష్టానం త్వరలో ప్రజామోదం పొందిన నాయకుడిని ఎంపిక చేస్తారని కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదని సమన్వయం పాటించి వర్గ విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమిపాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పరుగులు, విద్య, వైద్యం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలవడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాలకు కట్టుబడి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News