Tuesday, 14 April 2026 05:27:45 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

Date : 12 April 2026 09:15 PM Views : 55

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో పార్టీకి అండగా నిలవాలని టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని ఎగువ బోయపల్లెలో కొడిగి మల్లికార్జున, కృష్ణమాచారి లా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కట్టాదొరస్వామి నాయుడుకు పూలమాలలు, దృశ్యాలవులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తంబళ్లపల్లె టిడిపికి అధిష్టానం త్వరలో ప్రజామోదం పొందిన నాయకుడిని ఎంపిక చేస్తారని కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదని సమన్వయం పాటించి వర్గ విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమిపాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పరుగులు, విద్య, వైద్యం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలవడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాలకు కట్టుబడి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :