Sunday, 13 September 2026 02:48:10 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

Date : 12 April 2026 09:15 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంతో పార్టీకి అండగా నిలవాలని టిడిపి నియోజకవర్గ స్థాయి నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని ఎగువ బోయపల్లెలో కొడిగి మల్లికార్జున, కృష్ణమాచారి లా ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు కట్టాదొరస్వామి నాయుడుకు పూలమాలలు, దృశ్యాలవులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తంబళ్లపల్లె టిడిపికి అధిష్టానం త్వరలో ప్రజామోదం పొందిన నాయకుడిని ఎంపిక చేస్తారని కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదని సమన్వయం పాటించి వర్గ విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమిపాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని ప్రశంసించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలుతోపాటు రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పరుగులు, విద్య, వైద్యం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలవడం ఖాయం అన్నారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాలకు కట్టుబడి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :