నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 ః మండలంలోని ముద్దలదొడ్డి (బాలి రెడ్డిగారిపల్లి) పంచాయతీ నుండి కోసువారి పల్లెలోని ఇండియన్ బ్యాంకు ఆర్థిక లావాదేవీల తోబాటు ఇంకా పలు రకాల పనుల కోసం సుమారు 30 గ్రామాల ప్రజలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను టిడిపి నేతలు తమ అధినాయకుల దృష్టికి తీసుకెళ్లి తద్వారా మదనపల్లి1డిపో మేనేజర్ రమణారెడ్డితో సంప్రదించి ముద్దలదొడ్డి నుండి కోసువారి పల్లెకు ఆర్టీసీ బస్ సర్వీస్ కొనసాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం స్థానిక తెలుగుదేశం సీనియర్ నాయకుడు మదనమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడు శివరాం , గ్రామ కమిటీ అధ్యక్షురాలు సరస్వతమ్మలతో కలసి బస్ సర్వీసును ప్రారంభించారు. బస్ సర్వీస్ ప్రారంభంతో గ్రామ ప్రజలు టిడిపి నేతలతో పాటు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News