నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : దేశం లో రైతుల శ్రేయస్సు కోసం 1936 ఏప్రిల్ 11వ తేదీన ఆవిర్బవించిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేటికీ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి టమోటో మార్కెట్ ఎదుట ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో రైతాంగానికి భూమి నీరు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు వలన రైతులు నిలువునా మోసపోతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలై అప్పులు ఊపులో కూరుకొని పోయి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని కోవత్తు లాగా తాను కరుగుతూ 10 మందికి వెలుగునిచ్చే విధంగా పండించిన పంట పెట్టుబడి రాకపోయినా దేశానికి అన్నం పెట్టాలని తాపత్రయపడే రైతన్న నేడు ఎటుతోశని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని భయపడ్డారు ఈ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతాంగానికి బోర్ మోటార్లకు ఆదాన్ని స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వమని వాటిని ధ్వంసం చేయండి అని పలకల్పాలు పలికి నేడు అదే పని చేస్తున్నారని రీ సర్వే పేరుతో రైతులు మధ్య చిచ్చు పెడుతూ తగాదాలు ప్రేరేపిస్తున్నారని రైతాంగాన్ని భూములును అప్పనంగా దోచుకుని కార్పొరేట్లకు కారు సౌకగా అమ్ముతున్నారని రాబోకాలంలో తినడానికి అన్నం లేక టాబ్లెట్లు తినే రోజులు వస్తాయని రైతు సంఘం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం సాంబ శివ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు సురేష్ కుమార్ రెడ్డప్ప రెడ్డి భాష మౌలాలి రామకృష్ణ నాగరాజు రవీంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News