Monday, 14 September 2026 09:00:21 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో విజయవంతం గా కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్ 2k26

ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించిన ఛాన్సలర్ విజయభాస్కర్ చౌదరి

Date : 27 March 2026 06:45 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మార్చి 27 : అంగళ్ళు సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ లో అశ్వ్–2కె26 రెండు రోజుల జాతీయ స్థాయి టెక్నో, కల్చరల్, స్పోర్ట్స్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి ప్రారంభించారు. 1998 సంవత్సరం లో మదనపల్లి బెంగుళూరు రోడ్డు లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అని, మదనపల్లి తో పాటు పరిసర ప్రాంతాల వారికి అనువుగా ఉండడం తో మిట్స్ ప్రస్థానం మొదలు, ఆనాటి నుండి అంచెలు అంచేలుగా ఎదిగి నేడు యూనివర్సిటీ స్థాయికి రావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. మిట్స్ కు A+ గ్రేడ్ రావడం అభినందనీయం అని అన్నారు. తమ యూనివర్సిటీ లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ముక్యంగా అత్యుత్తమ మల్టీనేషనల్ కంపెనీలలో వివిధ రాష్ట్రాల లో పనిచేస్తున్నారని, అంతేకాకుండా ఎంతో అత్యుత్తమ స్థానాలలో ఉన్నారని, వారి కలయిక కోసం బెంగళూరు మరియు హైదరాబాద్ లో అల్యూమిని మీట్ నిర్వహించడం జరిగినది అని అన్నారు. కార్యక్రమంలో 1998 సంవత్సరం నుండి 2025 వరకు చదివిన విద్యార్థులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు అని అన్నారు. మిట్స్ విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడాన్ని అభినందిస్తూ, ఇలాంటి వేడుకలు వారి జీవితంలో చిరస్మరణీయ జ్ఞాపకాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం, మౌనిక యాదవ్, అలాగే సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరించారు. “రాకాస” సినిమా ట్రైలర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. రెండవ రోజు సినీ నటుడు శర్వానంద్ మరియు నటి మాళవిక నాయర్ విద్యార్థులతో మమేకమై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. జబర్దస్త్ కళాకారుల హాస్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక మరియు నృత్య కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు వివిధ ఆట పాటలతో మరియు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన “రామాయణం” నాటికకు ప్రేక్షకుల ప్రశంసలు లభించగా, ఉత్తమ ప్రదర్శనగా గుర్తించి ఛాన్సల్లర్ రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. మొత్తం ఫెస్ట్ విజయవంతంగా ముగిసి, విద్యార్థులకు చిరస్మరణీయ అనుభవాలను అందించింది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :