నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 28 : ఈనెల 30వ తేదీన మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టి తంబళ్లపల్లె లో జరిగే విజయోత్సవ ర్యాలీకి హాజరవుతున్నారని తంబళ్లపల్లెలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయమై శుక్రవారం ఆయన టిడిపి నాయకులు కార్యకర్తలతో సమావేశమై జి శంకర్ యాదవ్ స్వాగత ఏర్పాట్లు విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు సహకరించాలని కోరారు
Reporter
Namitha News