Monday, 08 June 2026 08:20:03 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలే లక్ష్యం : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 02 June 2026 05:24 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02: అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించార

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 35 రోజుల కాలంలో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రీన్యూవల్‌ల కోసం మొత్తం 27 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిలో 16 పరిశ్రమలకు సంబంధిత శాఖలు అనుమతులు, రెన్యూవల్‌ మంజూరు చేశాయని, మరో 10 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి అవసరమైన అనుమతులు జారీ చేయాలని పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడి రాయితీల కింద జిల్లాలోని ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ.3.76 కోట్ల విలువైన రాయితీల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద జిల్లాలో 74 యూనిట్లకు రూ.2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 27 యూనిట్లకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎంఈజీపీ దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అన్నమయ్య జిల్లాను పరిశ్రమల అభివృద్ధికి అనువైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె. కృష్ణ కిశోర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వై.వి.కే. సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :