నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02: అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించార
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత 35 రోజుల కాలంలో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రీన్యూవల్ల కోసం మొత్తం 27 దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిలో 16 పరిశ్రమలకు సంబంధిత శాఖలు అనుమతులు, రెన్యూవల్ మంజూరు చేశాయని, మరో 10 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించి అవసరమైన అనుమతులు జారీ చేయాలని పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడి రాయితీల కింద జిల్లాలోని ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ.3.76 కోట్ల విలువైన రాయితీల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద జిల్లాలో 74 యూనిట్లకు రూ.2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 27 యూనిట్లకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పీఎంఈజీపీ దరఖాస్తులను బ్యాంకులు త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అన్నమయ్య జిల్లాను పరిశ్రమల అభివృద్ధికి అనువైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె. కృష్ణ కిశోర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వై.వి.కే. సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
Reporter
Namitha News