Thursday, 16 April 2026 03:21:30 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

గుండ్ల పల్లెలో దళితుల భూముల ల్యాండ్ డెవలప్మెంట్

50 ఎకరాలు బంజరు సాగు భూములయ్యాయి

Date : 23 March 2026 08:39 PM Views : 100

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 23 ః తంబళ్లపల్లె మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా దశాబ్దాలుగా బంజరు భూములుగా మిగిలిన దళితుల భూములను సాగు భూములగా మారి వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఏడాది క్రితం మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో దళితుల భూములు రికార్డులలో భూములు రాళ్లు గుట్టలు తప్ప సాగుభూమి లేకపోవడంతో దళిత రైతులు వ్యవసాయం లేక కూలీలకే పరిమితమయ్యారు. ఈ సమస్య పరిష్కారం లో భాగంగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఆధ్వర్యంలో దళితుల భూముల సాగులోకి తేవడానికి ఏపీఎఫ్ ఫౌండేషన్ సహకారంతో శ్రీకారం చుట్టారు. ఏడాదిగా గుండ్లపల్లి దళితవాడ కు చెందిన 50 మంది రైతుల 50 ఎకరాలు భూములను గుర్తించి వారి భూములను సాగు లోకి తేవడానికి నిరంతర కృషి చేశారు. గత రబీ సీజన్లో ల్యాండ్ డెవలప్మెంట్లో సాగులోకి తెచ్చిన భూములలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన తోబాటు వారికి అన్ని రకాల విత్తనాలను సైతం ఉచితంగా సరఫరా చేసి వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. నేడు ఆ భూముల్లో దళిత రైతులు ఉలవలు, వేరుశనగ, మొక్కజొన్న, కంది, సజ్జ,చిరుధాన్యాలు, పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేసి లబ్ధి పొందుతున్నారు. ఈ విషయమై ల్యాండ్ డెవలప్మెంట్ లో లబ్ధి పొందిన దళిత రైతులు వేటా మల్లికార్జున, లక్ష్మయ్య, సిద్ధప్పలు మాట్లాడుతూ మాకు పోర్డు సంస్థ డైరెక్టర్ జె.లలితమ్మ, ప్రతినిధి రమణ ద్వారా భూమి సాగులోకి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :