నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 23 ః తంబళ్లపల్లె మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా దశాబ్దాలుగా బంజరు భూములుగా మిగిలిన దళితుల భూములను సాగు భూములగా మారి వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఏడాది క్రితం మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో దళితుల భూములు రికార్డులలో భూములు రాళ్లు గుట్టలు తప్ప సాగుభూమి లేకపోవడంతో దళిత రైతులు వ్యవసాయం లేక కూలీలకే పరిమితమయ్యారు. ఈ సమస్య పరిష్కారం లో భాగంగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ జె. లలితమ్మ ఆధ్వర్యంలో దళితుల భూముల సాగులోకి తేవడానికి ఏపీఎఫ్ ఫౌండేషన్ సహకారంతో శ్రీకారం చుట్టారు. ఏడాదిగా గుండ్లపల్లి దళితవాడ కు చెందిన 50 మంది రైతుల 50 ఎకరాలు భూములను గుర్తించి వారి భూములను సాగు లోకి తేవడానికి నిరంతర కృషి చేశారు. గత రబీ సీజన్లో ల్యాండ్ డెవలప్మెంట్లో సాగులోకి తెచ్చిన భూములలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన తోబాటు వారికి అన్ని రకాల విత్తనాలను సైతం ఉచితంగా సరఫరా చేసి వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. నేడు ఆ భూముల్లో దళిత రైతులు ఉలవలు, వేరుశనగ, మొక్కజొన్న, కంది, సజ్జ,చిరుధాన్యాలు, పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేసి లబ్ధి పొందుతున్నారు. ఈ విషయమై ల్యాండ్ డెవలప్మెంట్ లో లబ్ధి పొందిన దళిత రైతులు వేటా మల్లికార్జున, లక్ష్మయ్య, సిద్ధప్పలు మాట్లాడుతూ మాకు పోర్డు సంస్థ డైరెక్టర్ జె.లలితమ్మ, ప్రతినిధి రమణ ద్వారా భూమి సాగులోకి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు
Reporter
Namitha News