Saturday, 12 September 2026 09:01:22 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక శత వార్షికోత్సవం ఉత్సవాలు

హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు

Date : 29 November 2025 06:53 PM Views : 271

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 3 కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు - హాజరవుతున్న మంత్రులు,అతిరథ మహారథులు - షేర్ హోల్డర్లు,డిపాజిటర్లు,ఖాతాదారులు,ప్రజలు హాజరై జయప్రదం చేయాలి - టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,డైరెక్టర్లు పిలుపు డిసెంబర్ 3న మదనపల్లె కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని మదనపల్లి కో - ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో బ్యాంకు డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యా సాగర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల వేడుకలకు బ్యాంకు షేర్ హోల్డర్లు,డిపాజిట్ దారులు,ఖాతాదారులు,ప్రజలు,ప్రముఖులు,విద్యావంతులు వ్యాపారులు,రాజకీయ నాయకులు,ప్రజాప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.డిసెంబర్ 3వ తేదీ (బుధవారం) మదనపల్లె పట్టణం బుగ్గ కాలువలో గల ఎన్.వి ఆర్ కళ్యాణ మండపం నందు ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న శతజయంతి ఉత్సవాలకు మంత్రులు,శాసనసభ్యులు,అతిరథ మహారధులను ఆహ్వా నించడం జరిగిందని,వారందరూ హాజరవుతారన్నారు.పుర ప్రజలు,షేర్ హోల్డర్స్,ఖాతా దారులు,డిపాజిట్ దారులు విశ్వాసం,సహకారంతో వందేళ్లు పురోభివృద్ధిలో ముందుకు సాగిందని తెలిపారు.రానున్న రోజుల్లో టౌన్ బ్యాంకుకు మరిన్ని బ్రాంచిలను ఏర్పాటు చేసి,ఖాతాదారులకు మొరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంకు సామాన్య,పేద,మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా ఆదుకున్న చరిత్రని సొంతం చేసుకుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కో- ఆపరేటివ్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని,స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుడా బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు.బ్యాంకు వైస్ చైర్మన్ మరియు పలువురు డైరెక్టర్లు మాట్లాడుతూ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.ఈ వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.వందేళ్ల ప్రయాణంలో టౌన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి బాసటగా నిలిచి,వారి అభివృద్ధికి తోడ్పడిందని గుర్తు చేశారు.కావున ఈ ఉత్సవాలకు ప్రజలు పుర ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: