Wednesday, 29 July 2026 04:16:04 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్

Date : 19 July 2026 10:40 PM Views : 61

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 19 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వి నవీన్ కు అమృత విశ్వ విద్యాపీఠం, చెన్నై నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. "Certain Investigations on Dynamic Gated Fusion and Lightweight Audio-Visual Models for Multimodal Sentiment Analysis of Product Reviews"("సర్టెన్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ డైనమిక్ గేటెడ్ ఫ్యూజన్ అండ్ లైట్‌వెయిట్ ఆడియో-విజువల్ మోడల్స్ ఫర్ మల్టీమోడల్ సెంటిమెంట్ అనాలిసిస్ ఆఫ్ ప్రొడక్ట్ రివ్యూస్") అనే అంశంపై డాక్టర్ ఎస్. సౌంతర్రాజన్ పర్యవేక్షణలో నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తమయ్యే భావోద్వేగాల విశ్లేషణ, కృత్రిమ మేధస్సు ఆధారిత ఆడియో-విజువల్ డేటా విశ్లేషణ, తక్కువ కంప్యూటింగ్ వనరులతో అధిక సామర్థ్యం కలిగిన డీప్ లెర్నింగ్ నమూనాల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. పీహెచ్‌డీ పట్టా పొందిన వి. నవీన్ ను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ దినేష్ మరియు అధ్యాపకులు అభినందించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :