Wednesday, 29 July 2026 05:19:35 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఉపాధి హామీలోపండ్ల తోటల పెంపకానికి శ్రీకారం - ఏపీవో అంజనప్ప

Date : 25 June 2026 10:48 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 25 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డ్వామా పిడి వెంకటరత్నం ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం మండలంలోని పంచాలమర్రి పంచాయతీలో రైతు విశ్వనాథరెడ్డి కి చెందిన ఐదు ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి ఏ సుజాత లు పూజ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ మండలంలో 160 ఎకరాలలో పండ్ల తోటలు పెంపకానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యంగా కొబ్బరి చెట్లు పెంపకం పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఒక్కో రైతుకు 20 కొబ్బరి మొక్కలు నాటాలని సూచించారు. అదేవిధంగా మామిడి, నేరేడు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, సపోటా పండ్ల మొక్కలు నాటుకోవచ్చన్నారు. మండలంలోని రైతులకు ఎన్ని ఎకరాలైనా పండ్ల మొక్కల పెంపకానికి సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా జలధార-జల హారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనులు వేగవంతం చేస్తున్నామని ఈనెలాఖరకు జలధార పనులు పూర్తి చేయడానికి ఉపాధి హామీ అధికారులను పురమాయించినట్టు చెప్పారు. ఆయన వెంట ఫీల్డ్ అసిస్టెంట్లు నరసింహులు, వేమనారాయణ, ఉపాధి కూలీలు, రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :