నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 25 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డ్వామా పిడి వెంకటరత్నం ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పండ్ల మొక్కలు నాటే. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం మండలంలోని పంచాలమర్రి పంచాయతీలో రైతు విశ్వనాథరెడ్డి కి చెందిన ఐదు ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి ఏ సుజాత లు పూజ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ మండలంలో 160 ఎకరాలలో పండ్ల తోటలు పెంపకానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యంగా కొబ్బరి చెట్లు పెంపకం పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఒక్కో రైతుకు 20 కొబ్బరి మొక్కలు నాటాలని సూచించారు. అదేవిధంగా మామిడి, నేరేడు, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, సపోటా పండ్ల మొక్కలు నాటుకోవచ్చన్నారు. మండలంలోని రైతులకు ఎన్ని ఎకరాలైనా పండ్ల మొక్కల పెంపకానికి సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా జలధార-జల హారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనులు వేగవంతం చేస్తున్నామని ఈనెలాఖరకు జలధార పనులు పూర్తి చేయడానికి ఉపాధి హామీ అధికారులను పురమాయించినట్టు చెప్పారు. ఆయన వెంట ఫీల్డ్ అసిస్టెంట్లు నరసింహులు, వేమనారాయణ, ఉపాధి కూలీలు, రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News