Sunday, 13 September 2026 10:59:55 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

క్వారీ డస్ట్ తరలింపుపై వివాదం, పోలీసులకు పిర్యాదు చేసిన ఇరు వర్గాలు

Date : 22 November 2025 08:10 PM Views : 390

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 22 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని దిన్నిపల్లె సమీపంలో క్వారీ డస్ట్ తరలింపుపై క్వారీ యజమానురాలు, కొనుగోలుదారు మధ్య వివాదం నెలకొంది.ఇది రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది .రామసముద్రం మండలం ఊ లపాడు పంచాయతి శాన్సిఫాం వద్ద ఉన్నశ్రీ రామ గ్రానైట్స్ ఫ్యాక్టరీ నుండి డస్ట్ కొనుగోలు కోసం మండల కేంద్రానికి చెందిన భాస్కర్ అనే ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వెళ్ళాడు. అయితే డస్ట్ తరలింపు సమయంలో క్వారీ కి భూమి లీజుకు ఇచ్చిన దర్శన్ గౌడ్ కు భాస్కర్ కు మధ్య వివాదం నెలకొంది.దర్శన్ గౌడ్ తనను కులం పేరుతో దూషించారని భాస్కర్ పోలీసులకు పిర్యాదు చేశాడు.అయితే ప్రెస్ రిపోర్టర్ పేరుతో భాస్కర్ తనపై దౌర్జన్యం చేసి,డస్ట్ దొంగతనం ప్రయత్నం చేయగా అడ్డు వచ్చిన తనపై కులం పేరు చెప్పి అట్రాసిటీ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని,భాస్కర్ తో తనకి ప్రాణహాని ఉందని , భాస్కర్ నుండి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ శివమ్మ పోలీసులకు పిర్యాదు చేసింది.ఇరువురు పిర్యాదు దారుల మద్దతు దారులతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ విషయమై ఇరువురు ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని యస్.ఐ. రమేష్ బాబు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :