నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 07 : అన్నమయ్య 2004 లో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పోరాటంతో నాటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. ఈ విషయమై శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు.నేడు నిరుపేదలు సైతం ఉచితంగా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా పొందడం మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ వేట మల్లికార్జున, మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, కురబలకోట ఇంచార్జ్ కుమార్, మండల మాజీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సుధాకర్, పెద్దమండెం అధ్యక్షురాలు రాములమ్మ, రెక్కల కొండ రామ్మోహన్, మండలంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News