నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 06 : ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్నారై మీరా మొహిద్దిన్ నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ పార్టీ శ్రేణులు వారి అభిమానులు పట్టణంలోని బిఎస్సార్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు.. మైనార్టీ అధ్యక్షులుగా తనను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్నారై మీరా మొహిద్దిన్ తెలిపారు.. BSR సెంటర్ లో భారీగా బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు కేకులు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు, కొండ వెంకటేశ్వర్లు, పులిమి రమేష్ రెడ్డి,వెంగల్ రెడ్డి, మస్తాన్ వలి, సురేష్, యస్దాని, సుబ్బారెడ్డి , షారుక్, రహీం, షైబి,సర్దార్, జనార్దన్ రెడ్డి, తారిఖ్ తదితరులు పాల్గొన్నారు .
Admin
Namitha News