నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 08 : ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరుతో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి మా కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. ఆదివారం మండలంలోని కోసువారిపల్లి పంచాయతీలోని పలు గ్రామాలకు చెందిన ఆరు మంది గతంలో పలు ప్రమాదాలు, వ్యాధులు సోకి అప్పులు చేసి చికిత్సలు చేయించుకున్నారు. వారి ఆర్థిక ఇబ్బందులు గుర్తించిన టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరిశ్రీనివాసులు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు మంజూరుకు సహకరించారు. ఆదివారం టిడిపి, కూటమి నేతలు 6 మంది లబ్ధిదారులకు రూ ఆరు లక్షల పైచిలుకు నిధుల చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు స్థానిక టిడిపి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పంపిణీ నీ కార్యక్రమంలో బయమ్మచెరువు సంఘ అధ్యక్షుడు ఆదిరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News