Wednesday, 29 July 2026 05:19:33 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ ఎన్.సి.సి. ఎయిర్ వింగ్ విభాగం క్యాడేట్ లు జాతీయస్థాయి లో ప్రతిభ

Date : 06 July 2026 11:04 PM Views : 66

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 06 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎన్‌సీసీ ఎయిర్ వింగ్‌కు చెందిన క్యాడెట్ జి. రుద్ర తేజ భారత వైమానిక దళం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ అటాచ్‌మెంట్ క్యాంప్ (AFAC) ను విజయవంతంగా పూర్తి చేసి విశిష్ట ప్రతిభ కనబరిచాడని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ జాతీయ స్థాయి శిక్షణను హైదరాబాద్‌లోని డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా క్యాడెట్ రుద్ర తేజకు భారత వైమానిక దళం కార్యకలాపాలు, యుద్ధ మరియు శిక్షణ విమానాల పరిచయం, విమానయాన సాంకేతిక అంశాలు, సైనిక క్రమశిక్షణ, నాయకత్వ వికాసం, జట్టు భావన, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ పొందారని అన్నారు. అలాగే భారత వైమానిక దళ అధికారులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం పొందారని తెలిపారు. దేశ నలుమూలల నుండి 100 మందికిపైగా పాల్గొన్న ఈ శిక్షణలో మిట్స్ యూనివర్సిటీ క్యాడెట్ ప్రతిభ చూపడం గర్వకారణం అని అన్నారు.ఈ జాతీయ స్థాయి శిక్షణా శిబిరం ఎయిర్ ఫోర్స్ అటాచ్‌మెంట్ క్యాంప్ కమాండెంట్ వింగ్ కమాండర్ ఆర్యన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిందని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమంలో ప్రతిభ చూపిన క్యాడెట్ జి. రుద్ర తేజ ను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్-ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :