నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి హుండీల ద్వారా భక్తులు రూ 18,74,954 లక్షలు ఆదాయం వచ్చినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ శశి కుమార్, ఈవో ముని రాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు విలేకరుల తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. సాధారణ హుండీ ద్వారా రూ 14,40,650, లక్షలు చదివింపులు ద్వారా రూ 28,000 వేలు, తాత్కాలిక హుండీ ద్వారా రూ 1,24,809 లక్షలు, టికెట్లు ద్వారా రూ 2,81,496 లక్షలు మొత్తం రూ 18,74,954 ఆదాయం సమకూరింది. నగదు తో పాటు బంగారు, వెండి వస్తువులు భక్తులు కానుకగా సమర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, టిడిపి నాయకులు తులసీదర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, సోమశేఖర్, రామచంద్ర, కాలా నారాయణ, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి, నరసింహులు, శంకర, బిజెపి నాయకులు రమణ, లక్ష్మయ్య, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News