నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 5 : తంబళ్లపల్లె మండలం లో మార్చ్ లో జరిగే టెన్త్ పరీక్ష కేంద్రాలను బుధవారం అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొండూరు శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె ఎగ్జామ్స్ సెంటర్లు మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, డెస్కులు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి తదితర అంశాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, ఎగ్జామ్ సెంటర్ల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, హేమంత్ కుమార్ మరియు డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ రవి పాల్గొన్నారు.
Reporter
Namitha News