Monday, 08 June 2026 09:53:35 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

కోళ్లబైలు లో రూ.4.5 కోట్లతో 39 రోడ్లు ఏర్పాటు కోళ్లబైలు ఇన్చార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు

Date : 08 November 2025 04:32 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్ 8: అభివృద్ధి సంక్షేమానికి టిడిపి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కోళ్లబైలు పంచాయతీలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు జరిగాయని కోళ్లబైలు టిడిపి ఇన్ ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోళ్లబైలు పంచాయతీలో 14 వేలకు పైగా జనాభా ఉన్నారని, 5 వేల మంది వరకు ఓటర్లు ఉన్నారని, అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు.‌ ఒక్క రోడ్డు వేయలేదని కాలువ నిర్మించలేదని విమర్శించారు. టిడిపి కూటమి సర్కార్ అధికారం చేపట్టిన 16 నెలల్లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష కోళ్లబైలు పంచాయతీ పై ప్రత్యేక దృష్టి సారించి రూ. 4.5 కోట్ల నిధులతో 39 రోడ్లను వేయించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కోళ్లబైలులో 12 వీధులకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం జరిగిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా తమ ప్రభుత్వం లో నిధులు కేటాయించామని వైసీపి నేత నిస్సార్ అహ్మద్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డేటా సెంటర్ ను తామే తెచ్చామని వైసీపి అధ్యక్షుడు జగన్ చెప్పుకుంటున్నట్లు నిస్సార్ అహ్మద్ మతిభ్రమించి తామే నిధులు కేటాయించామని డప్పు కొట్టుకుంటున్నారన్నారు.‌ వైసిపీ హయాంలో నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం వంద ఇళ్లు మంజూరు చేస్తే 200 ఇంటి స్థలాలు ఆక్రమించుకున్నారన్నారు. నిసార్ అహ్మద్ కు చిత్తశుద్ది ఉంటే వైసీపి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్థానిక సంస్థల‌ ఎన్నికలలో వైసిపి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బాలిమాలి శేఖర్ రాయల్, రెడ్డిశేఖర్, జివి నాయుడు, శ్రీనాథ్, రామచంద్ర, స్నేహ మెడికల్స్ రమేష్, మోహన్ రెడ్డి, అంజి,తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :