Wednesday, 29 July 2026 03:23:18 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు

Date : 01 December 2025 08:48 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - డిసెంబర్ 01 : రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నామని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం నాడు పార్టీ కార్యాలయం నందు చమర్తి జగన్ మోహన్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం,వ్యవసాయం,పారిశ్రామిక రంగం అభివృద్ధి ఏపీ ప్రభుత్వ లక్ష్యమని. చమర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 57 వేల కోట్లను ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల రూపంలో చేస్తున్నట్లు ఆయన తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్స్ పంపిణీ చేసి సరిపుచ్చుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి ₹4000 ఆయా కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. తల్లికీ వందనం లాంటి పథకాలను అమలు చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో చదువుకున్న వారికీ ఉద్యోగాలు లేని పరిస్థితి నేడు గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చమర్తి వివరించారు. అధేవిధంగా గత ప్రభుత్వ హయాంలోనే జిల్లా కేంద్రం విషయంపై అనేక తప్పులు జరిగాయని,రాజంపేట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేలా ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బ నరసయ్య నాయుడు, పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు,సొసైటీ చైర్మన్ ములుగూరి సుబ్రహ్మణ్యం నాయుడు,ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి,మాజీ మండల అధ్యక్షులు బాసినేని వెంకటేశ్వర నాయుడు,తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :