నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - డిసెంబర్ 01 : రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నామని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు - నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం నాడు పార్టీ కార్యాలయం నందు చమర్తి జగన్ మోహన్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం,వ్యవసాయం,పారిశ్రామిక రంగం అభివృద్ధి ఏపీ ప్రభుత్వ లక్ష్యమని. చమర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 57 వేల కోట్లను ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల రూపంలో చేస్తున్నట్లు ఆయన తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్స్ పంపిణీ చేసి సరిపుచ్చుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కరికి ₹4000 ఆయా కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. తల్లికీ వందనం లాంటి పథకాలను అమలు చేస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో చదువుకున్న వారికీ ఉద్యోగాలు లేని పరిస్థితి నేడు గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చమర్తి వివరించారు. అధేవిధంగా గత ప్రభుత్వ హయాంలోనే జిల్లా కేంద్రం విషయంపై అనేక తప్పులు జరిగాయని,రాజంపేట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేలా ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బ నరసయ్య నాయుడు, పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు,సొసైటీ చైర్మన్ ములుగూరి సుబ్రహ్మణ్యం నాయుడు,ఒంటిమిట్ట మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి,మాజీ మండల అధ్యక్షులు బాసినేని వెంకటేశ్వర నాయుడు,తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News