నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వినాయక మండపాల నిర్వహణపై పోలీసుల సూచనలు -- డి.ఎస్.పి బుచ్చిరాజు వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసే వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శుక్రవారం డీఎస్పీ బుచ్చిరాజు సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ భద్రతా చర్యలు చేపట్టడం, అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రహదారులు, కాలనీల ప్రవేశ మార్గాలను ఆక్రమించకుండా మండపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, లౌడ్స్పీకర్ల వినియోగంలో శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలని, రాత్రి వేళల్లో పరిమితులు అతిక్రమించరాదన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే ఊరేగింపులు నిర్వహించాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సహకరించాలని డిఎస్పీ, సీఐ లు కోరారు. మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించి వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజారెడ్డి, టూ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ, తాలూకా సిఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, ఎస్ఐలు, వినాయక మండపాల నిర్వాహకులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News