Friday, 19 June 2026 03:23:49 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

కోసువారి పల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుడిగాలి పర్యటన

Date : 22 April 2026 08:58 PM Views : 329

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం తంబళ్లపల్లె లోని ఆయన స్వగృహం నుండి కోసువారిపల్లి పంచాయతీ తరుగువారిపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆతిథ్యం స్వీకరించి ఆకుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబం ఎమ్మెల్యే కి సాదర స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో తీవ్ర అస్వస్థత గురై కాలు పోగొట్టుకున్న శేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తదుపరి కోసువారి పల్లెకు చెందిన మాజీ మల్లయ్య కొండ ఆలయ కమిటీ మెంబర్ మిల్ట్రీ రెడ్డప్ప రెడ్డి సతీమణి అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పరెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి మెరుగైన చికిత్సలు చేయించాలని సూచించారు. రెడ్డప్పరెడ్డికి నీకు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ధైర్యం నూరిపోశారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని ముందు ముందు మంచి రోజులు వస్తాయని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, బొట్టు శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,చక్రపాణి, బావ జాన్, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :