నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం తంబళ్లపల్లె లోని ఆయన స్వగృహం నుండి కోసువారిపల్లి పంచాయతీ తరుగువారిపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆతిథ్యం స్వీకరించి ఆకుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబం ఎమ్మెల్యే కి సాదర స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో తీవ్ర అస్వస్థత గురై కాలు పోగొట్టుకున్న శేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తదుపరి కోసువారి పల్లెకు చెందిన మాజీ మల్లయ్య కొండ ఆలయ కమిటీ మెంబర్ మిల్ట్రీ రెడ్డప్ప రెడ్డి సతీమణి అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పరెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి మెరుగైన చికిత్సలు చేయించాలని సూచించారు. రెడ్డప్పరెడ్డికి నీకు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ధైర్యం నూరిపోశారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని ముందు ముందు మంచి రోజులు వస్తాయని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, బొట్టు శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,చక్రపాణి, బావ జాన్, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News