Sunday, 03 May 2026 08:10:52 PM
# రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయండి - ఎంపీడీవో యం వి ప్రసాద్ # తంబళ్లపల్లెలో గాలి వాన బీభత్సానికి మామిడి రైతుల విలవిల # కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్ # తంబళ్లపల్లె లో గాలివాన బీభత్సం # జిల్లా సమగ్రాభివృద్ధికి దృఢ ప్రణాళిక తో లక్ష్యం ను ఆదిగమించాలి - కలెక్టర్ # సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి పెంపుపై కలెక్టర్ నిశాంత్ కుమార్ దిశానిర్దేశం # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి # మదనపల్లి డీఎస్పీ పావని ని సన్మానించిన దళిత నాయకులు

కోసువారి పల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుడిగాలి పర్యటన

Date : 22 April 2026 08:58 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం తంబళ్లపల్లె లోని ఆయన స్వగృహం నుండి కోసువారిపల్లి పంచాయతీ తరుగువారిపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆతిథ్యం స్వీకరించి ఆకుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబం ఎమ్మెల్యే కి సాదర స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో తీవ్ర అస్వస్థత గురై కాలు పోగొట్టుకున్న శేఖర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తదుపరి కోసువారి పల్లెకు చెందిన మాజీ మల్లయ్య కొండ ఆలయ కమిటీ మెంబర్ మిల్ట్రీ రెడ్డప్ప రెడ్డి సతీమణి అనారోగ్యం బారినపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డప్పరెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి మెరుగైన చికిత్సలు చేయించాలని సూచించారు. రెడ్డప్పరెడ్డికి నీకు మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ధైర్యం నూరిపోశారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని ముందు ముందు మంచి రోజులు వస్తాయని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, బొట్టు శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి,చక్రపాణి, బావ జాన్, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: