నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 6 ః తనకు పిత్రార్జితం గా వచ్చిన భూమిని చూపించాలని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగి ఎనిమిది మాసాలు కావచ్చినా పట్టించుకోలేదని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు సలాది రాజశేఖర్ కోసువారిపల్లి ప్రత్యేక అధికారి తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది 20-08-2025 తేదీన బి కొత్తకోట మండలంలోని తన పెద్దలకు చెందిన భూములకు చెందిన రికార్డులు, సర్వే నెంబర్లు, అడంగల్ తదితర వివరాలకు సమాచార హక్కు చట్టం ద్వారా సలాది రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా వెంటనే పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో సోమవారం కోసువారిపల్లె పంచాయతీ ప్రత్యేక అధికారి తాసిల్దారు శ్రీనివాసులకు ఫిర్యాదు చేయగా ఆయన సంబంధిత బి కొత్తకోట తాసిల్దార్ దృష్టికి పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News