నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 30 : జనగణన కార్యక్రమంలో ఎన్నికల సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని ఎన్నికల ఛార్జ్ ఆఫీసర్ తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో సూపర్వైజర్లకు ఐడి కార్డులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని పోలింగ్ బూత్ ల వారి సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులు చేపట్టిన జనగణన సర్వేలో సూపర్వైజర్లు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నికాసైన ఓటర్ల గుర్తింపు చేపట్టాలని సూచించారు. జనగణన పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా గుర్తించడానికి సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సహకరించాలని సూపర్వైజర్లు తమ పర్యవేక్షణ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ,మండలంలోని సూపర్వైజర్లు, రెవిన్యూ విఆర్వోలు అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News